న్యూఢిల్లీ, డిసెంబర్ 4: భారత ఒలింపిక్ సంఘంపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. ఒలింపిక్ ఛార్టర్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గతంలోనే స్పష్టం చేసింది. అయితే ఎన్నికల విషయంలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని ఐఓసీ తీవ్రంగా పరిగణించి ఈ చర్య తీసుకుంది. కాగా సస్పెన్షన్ కొనసాగితే 2016లో జరిగే ఒలింపిక్ క్రీడలలో భారత్ క్రీడాకారులు పాల్గొనే అవకాశం కోల్పోతారు. అంతేకాకుండా భారత్ లో క్రీడాభివృద్ధికి ఐఓసీ నిధులు నిలిచిపోతాయి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఎ) సెక్రటరీ జనరల్గా కళంకిత లలిత్ భానోత్ ఎన్నికయిన విషయం తెలిసిందే. అధ్యక్షునిగా అభరు సింగ్ చౌతాలా కూడా శుక్రవారం నాడు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి కేసులో అరెస్టయిన భానోత్ గతేడాది పదకొండు నెలలు జైలు జీవితం గడిపారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) తమపై నిషేధం విధించకుండా భారత్ ఇప్పటి వరకూ చేస్తున్న ప్రయత్నాలకు విరుద్ధమైనరీతిలో భానోత్ను ఎన్ను కోవటం వివాదం మరింతగా రాజుకుంది. ఒలింపిక్ సంస్థల్లో కళంకిత వ్యక్తులు ఉండరాదని ఐఓసి నైతిక విలువల కమిటీ ఇప్పటికే సిఫార్సు చేసింది. అయినా భానోత్ను సెక్రెటరీ జనరల్గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. క్రీడా మంత్రిత్వ శాఖ కోడ్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించటంతో భారత ఒలింపిక్ సంఘంపై నిషేధం విధిస్తూ బోర్డు కార్యవర్గ సమావేశంలో ఐఓసి నిర్ణయం తీసుకుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment