Friday, December 28, 2012

టి-ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ...

అహ్మదాబాద్, డిసెంబర్ 28:   పాకిస్థాన్‌తో జరిగిన రెండో టి-ట్వంటీలో భారత్ 11పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ట్వంటీ-20 మ్యాచ్లో  ఓటమి పాలైన భారత్ ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమం చేసింది. భారత్ విసిరిన 193 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పాకిస్తాన్  నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగుల మాత్రమే చేయగలిగింది.  భారత్ బౌలర్లలో దిండా మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, అశ్విన్, యువరాజ్‌లకు ఒక్కో  వికెట్టు లభించింది. 36 బంతుల్లో ఏడు సిక్సర్లు, నాలుగు ఫోర్ల తో 72 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన యువరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కగా, ఈ సిరీస్‌లో ఆకట్టుకున్న హఫీజ్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...