Friday, December 28, 2012

అమాత్యులవారిదో మాట....వారి శాఖది మరో మాట....

న్యూఢిల్లీ, డిసెంబర్ 28:  తెలంగాణపై అఖిల పక్ష సమావేశ ప్రహసనం పూర్తయింది. తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని షిండే అఖిల పక్ష  సమావేశానంతరం మీడియా సమావేశంలో స్పష్టంగా చెప్పారు. కానీ,  సాయంత్రం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి విడుదలైన ప్రకటనలో మాత్రం  నెల రోజుల్లో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తామనే విషయం  లేదు. నెల రోజుల్లోగా పరిష్కరించాలని కొన్ని పార్టీలు కోరాయని మాత్రమే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఉంది.  రాష్ట్రానికి చెందిన 8 పార్టీల అఖిల పక్ష సమావేశంలో  ఒక్కో పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధుల చొప్పున  పాల్గొన్నారు.  అఖిల పక్ష సమావేశం ఇన్‌కెమెరా మీటింగ్ అని, అందువల్ల ఏ పార్టీ ప్రతినిధులు ఏమన్నారనే విషయం తాను వెల్లడించబోనని ఆయన అన్నారు. తెలంగాణపై ఇదే చివరి అఖిల పక్ష సమావేశమని తాను చెప్పినట్లు షిండే తెలిపారు.  తాము అందరి వాదనలు విన్నామని, వాటిని నమోదు చేశామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని యువత సంయమనం పాటించాలని ఆయన అన్నారు.  తాము 2008లో ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో చెప్పిన వైఖరికి కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం అఖిల పక్ష భేటీలో చెప్పింది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అయితే తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తావమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...