Monday, December 10, 2012

తెలంగాణపై 28వ తేదినే ఆల్ పార్టీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: : రాష్ట్రంలోని అన్ని పార్టీలు  కోరితే అఖిల పక్ష సమావేశం వాయిదాపై ఆలోచిస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సోమవారం అన్నారు. 28వ తేదినే ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుందని,అన్ని పార్టీలకు ఆహ్వానాలు పంపిస్తామని,  ఒకవేళ పార్టీలు అన్ని కోరితేనే తేదీని వాయిదా వేసే విషయాన్ని ఆలోచిస్తామని చెప్పారు. తెలుగు మహాసభల దృష్ట్యా అఖిల పక్షం తేదీ మార్చాలన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తిని తోసి పుచ్చారు. సమస్య పరిష్కారమయ్యే వరకు సంప్రదింపులు కొనసాగుతాయన్నారు.
 జెఎసి హడావిడి....
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఈ నెల 26వ తేదీలోగా కచ్చితమైన వైఖరి వెల్లడించకపోతే 27వ తేదీన తెలంగాణ బంద్ పాటిస్తామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ హెచ్చరించారు.  సోమవారం జెఎసి విస్తృత స్థాయి సమావేశానంతరం ఆయన  మీడియాతో మాట్లాడుతూ,  ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రాజకీయ నాయకులతో ములఖాత్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీన విద్రోహ దినం పాటిస్తామని, ఈ సందర్భంగా నల్లజెండాల ప్రదర్శన ఉంటుందని ఆయన చెప్పారు. తెలంగాణపై అభిప్రాయం చెప్పని పార్టీల పట్ల అనుసరించాల్సిన కార్యాచరణను ఈ నెల 26, 27 తేదీల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ నెల 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మండల స్థాయిలో తెలంగాణ కోసం దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...