Thursday, December 20, 2012

గాయని నిత్యశ్రీ భర్త ఆత్మహత్య!

చెన్నై, డిసెంబర్ 20 :  శాస్త్రీయ గాయని నిత్యశ్రీ  భర్త మహదేవన్ చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని తమ ఇంటి వద్ద గల కొట్టూర్పూరం వంతెనపై నుంచి అడియార్‌లోకి దూకి ఆయన  ఆత్మహత్య చేసుకున్నారు. మహదేవన్ తన తెల్లటి హోండా సిటీలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో వంతెన వద్దకు వచ్చాడని, డ్రైవర్ కారు నడిపాడని పోలీసులు చెప్పారు. కారు ఆపాలని డ్రైవర్‌ను అడిగి, మహదేవన్ మొబైల్‌లో మాట్లాడుతూ  అడియార్‌లోకి దిగిపోయాడని సమాచారం.  భార్య భర్తల మధ్య కలహాలే మహదేవన్ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. ఈ విషయం తెలిసి నిత్యశ్రీ నిద్ర మాత్రలు మింగిందని, అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిసింది.   డికె పట్టమ్మాళ్ మనవరాలు అయిన నిత్యశ్రీ కర్ణాటక సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎంఎల్ వంసతకుమారి తో సమానంగా పేరు తెచ్చుకున్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...