Monday, December 24, 2012

గ్యాంగ్‌రేప్ బాధితురాలి పరిస్థితి విషమం

న్యూఢిల్లీ,డిసెంబర్ 24:  సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నగ్యాంగ్‌రేప్ బాధితురాలి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంకా వెంటిలేటర్ పైనే ఆమెకు చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు.
ఢిల్లీలో కొనసాగుతున్న ఆందోళనలు
 సామూహిక అత్యాచార ఘటనకు నిరసనగా  ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళన నేపథ్యంలో  పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు నగరంలోని పది మెట్రో రైల్వేస్టేషన్లను మూసివేశారు. ఇండియాగేట్, రాజీవ్‌చౌక్, విజయ్ చౌక్, రైసినా హిల్స్ ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇండియా గేట్ వద్దకు పోలీసులు ఎవరినీ అనుమతించటం లేదు. మీడియా వాహనాలపై ఆంక్షలు విధించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలికి ఆందోళనాకారులు దామిని అనే పేరు పెట్టి, గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాడుతున్నారు.
ప్రధానమంత్రి  విచారం
మహిళలకు పటిష్ట భద్రత కల్పిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారు. సామూహిక అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళనల నేపథ్యంలో ఆయన  జాతినుద్దేశించి ప్రసంగించారు.బాధితురాలు  త్వరగా కోలుకోవాలని తమ కుటుంబం ప్రార్థిస్తుందోన్నారు.  ప్రజల ఆందోళన అర్థవంతమైనదేనని, అయితే హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదన్నారు. సంయమనం పాటించాలని కోరారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...