Thursday, December 20, 2012

హిమాచల్‌ ' హస్త 'గతం...

సిమ్లా, డిసెంబర్ 20 : హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మొత్తం 68 స్థానాలకు గానూ 36 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీకి 26 స్థానాలు, ఇతరులు ఆరు స్థానాలను గెలుచుకున్నారు. . ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొనడంలో హిమాచల్‌ ముఖ్యమంత్రి ప్రేమ్‌ సింగ్‌ ధూమల్‌ విఫలమయ్యారు. అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ వీరభద్రసింగ్‌ కాంగ్రెస్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లో గట్టెక్కించారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆయన హిమాచల్‌ ప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...