Thursday, December 27, 2012

వెంకన్న సన్నిధిలో తెలుగు వెలుగు...


తిరుపతి, డిసెంబర్ 27 : నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభల వేడుకలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఇక్కడ ప్రారంభించారు. తెలుగు భాష ప్రాచీన భాషల్లో ఒకటని, తెలుగు భాషకు ఎంతో చరిత్ర ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు.  తెలుగు సాహిత్యానికి మూల పురుషులు నన్నయ, తిక్కన, ఎర్రన అన్నారు. తెలుగు శాస్త్రీయ భాష అన్నారు. 11-14 శతాబ్దాల మధ్య కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగమని రాష్ట్రపతి పేర్కొన్నారు.  కళా పూర్ణోదయం, ఆముక్త మాల్యద తెలుగులో కలికితురాయిలు అన్నారు. సామాజిక సంస్కరణలకు కన్యాశుల్కం మైలురాయి అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. తెలుగులో కొత్త పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. భాషలు మన వారసత్వ సంపదలని, ప్రాచీన భాషను రక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని అన్నారు. న్నారు. పరభాష నైపుణ్యంతో మాతృభాష అభివృద్ధికి, ప్రచారానికి కృషి చేయాలన్నారు.

అకాడమీల పునరుద్ధరణ 

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,   తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు  హామీ ఇచ్చారు. సంగీత, నాట్య, లలిత కళా అకాడమీలను తిరిగి ప్రారంభిస్తామన్నారు. పాఠశాలల్లో ప్రాథమిక దశ నుంచి 10వ తరగతి వరకు తెలుగు విధిగా పాఠాలు బోధించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ముందుగా సుశీల, రావు బాలసరస్వతి మాతెలుగు తల్లి పాటను పాడగా, తెలుగు భాషపై ప్రత్యేకంగా రచించిన, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను సభలో వినిపించారు. ఆనారోగ్య కారణాల వల్ల ఆయన ప్రత్యక్షంగా పాడలేకపోతున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...