శాంటియాగో, డిసెంబర్ 12: ప్రముఖ సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్ (92)మంగళవారం కన్నుమూశారు. అమెరికాలోని శాంటియాగోలో ఆయన తుది శ్వాస విడిచారు. రబింద్రో శౌంకర్ చౌదరి అయిన పండిట్ రవిశంకర్ 1920 ఏప్రిల్ 7వ తేదీన వారణాసిలో జన్మించారు. సమకాలీన సంగీత విద్వాంసుల్లో ఆయనకు ఆయనే సాటి. భారత సంగీతాన్ని పాశ్చాత్య దేశాల్లోకి తీసుకుని వెళ్లడంలో ఆయన విశేష కృషి సలిపారు. పండిట్ రవిశంకర్కు భార్య సుకన్య, కూతుళ్లు సితార విద్వాంసురాలు అనుష్కా శంకర్, గాయని నోరహ్ జోన్స్ ఉన్నారు. ఆయన కచ్చేరీలకు తోడుగా ఉండే కుమారుడు సుభేంద్ర శంకర్ 1992లో మరణించాడు. 1999లోభారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ఆయనను 1999లో వరించింది. మూడు సార్లు ఆయన గ్రామీ అవార్డులు అందుకున్నారు. చాంట్స్ ఆప్ ఇండియా, ఫ్లవర్స్ ఆఫ్ ఇండియా, త్రీ రాగాస్, ది సౌండ్స్ ఆఫ్ ఇండియా వంటి పలు ఆల్బమ్స్ను ఆయన వెలువరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment