అహ్మదాబాద్, డిసెంబర్ 18: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల లో బీజేపీ ఘనవిజయం సాధించడం, నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. ప్రముఖ ఎన్నికల ఫలితాల విశ్లేషణ సంస్థ టుడేస్ చాణక్య అయితే బీజేపీ ఈసారి మరింతగా ప్రభంజనం సృష్టిస్తుందని పేర్కొంది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 140 పైగా సీట్లను కొల్లగొడుతుందని జోస్యం చెప్పింది. ఏకంగా 50 శాతానికి పైగా ఓట్లు సాధిస్తుందని కూడా అభిప్రాయపడింది. 40 సీట్లతో కాంగ్రెస్ మరోసారి ఘోర పరాజయం మూటగట్టుకుంటుందని అంచనా వేసింది. సి-ఓటర్, హెడ్లైన్స్ టుడే, ఏబీపీ న్యూస్ తదితరాల సర్వేలు కూడా బీజేపీకి 116 నుంచి 128 సీట్లు వస్తాయని తేల్చాయి. ప్రస్తుతం బీజేపీకి 117, కాంగ్రెస్కు 59 సీట్లున్న విషయం తెలిసిందే. ఓట్ల లెక్కింపు గురువారం జరగనుంది. తాజా పోలింగ్ శాతం 1995 కంటే (64.39) కూడా ఎక్కువని ప్రధాన ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ ప్రకటించారు. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో 87 స్థానాలకు గత గురువారం తొలి దశలో పోలింగ్ జరగడం తెలిసిందే. సోమవారం రెండో దశలో 95 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Monday, December 17, 2012
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment