Wednesday, November 7, 2012

విధ్యార్ధి ఆత్మహత్య...ఉస్మానియాలో ఉద్రిక్తత

హైదరాబాద్, నవంబర్ 7: తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ  సంతోష్ అనే విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట గల చెట్టుకు ఉరి వేసుకున్నాడు.  అదిలాబాద్ జిల్లాకు చెందిన  సంతోష్ ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తెలంగాణ కోసమే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు సంతోష్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.  సంతోష్ అంతిమయాత్రకు తొలుత నిరాకరించిన పోలీసులు చివరకు సికింద్రాబాదులోని అమర వీరుల స్థూపం వరకు అనుమతించారు. అయితే, ఒయు పోలీసు స్టేషన్ వద్ద అంతిమ యాత్రను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...