వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం...
కరీంనగర్, నవంబర్ 7: 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. కరీంనగర్లో పార్టీ మేధోమథన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెసును నమ్మొద్దని, అది చాలా డేంజర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని చెప్పడం వల్లనే తాను చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని, చర్చలకు బ్రేకులు వేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ జెఎసిని తామే ఏర్పాటు చేశామని, జెఎసి చైర్మన్కా కోదండరామ్ను నియమించింది తానేనని, అటువంటి జెఎసి తాము ఎలా వదులుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసితో విభేదాలు చిన్నవేనని, ఆ సమస్యలు సమసిపోతాయని ఆయన అన్నారు. పార్లమెంటు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
కరీంనగర్, నవంబర్ 7: 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. కరీంనగర్లో పార్టీ మేధోమథన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెసును నమ్మొద్దని, అది చాలా డేంజర్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇస్తామని చెప్పడం వల్లనే తాను చర్చల కోసం ఢిల్లీ వెళ్లానని, చర్చలకు బ్రేకులు వేసింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు నాటకాలు ఆడుతోందని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ జెఎసిని తామే ఏర్పాటు చేశామని, జెఎసి చైర్మన్కా కోదండరామ్ను నియమించింది తానేనని, అటువంటి జెఎసి తాము ఎలా వదులుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసితో విభేదాలు చిన్నవేనని, ఆ సమస్యలు సమసిపోతాయని ఆయన అన్నారు. పార్లమెంటు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
No comments:
Post a Comment