Wednesday, November 7, 2012

ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కిస్తా....ఒబామా

వాషింగ్టన్,నవంబర్ 7:  అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన  విజయం  అమెరికా ప్రజలందరిదీనని   బరాక్ ఒబామా అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు  మరింత కృషి చేస్తానని చెప్పారు.  పార్టీలు వేరైనా తాను రోమ్నీతో కలిసి పని చేస్తానని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు, మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు రోమ్నీ సలహాలు, సహాయం తీసుకుంటానని చెప్పారు. నిరాశ, నిస్పృహ నుండి దేశాన్ని బయట పడేస్తానని, మన మధ్య బేధాభిప్రాయాలు ఎన్ని ఉన్నప్పటికీ అందరి దృష్టి మాత్రం అమెరికా భవిష్యత్తు మీదే ఉండాలని ఒబామ అన్నారు. ఆర్థిక మాంద్యానికి మన భావి  తరాలు బలి కాకూడదని, దానిని సమర్థవంతంగా ఎదుర్కొందామన్నారు. అమెరికా పౌరులు ఎప్పుడు కూడా మాకేం చేస్తారని ఆలోచించరని, మనమందరం కలిసి ప్రపంచానికి ఏం చేద్దామని ఆలోచిస్తారనీ అన్నారు. అమెరికా చాలా ఉన్నతమైనదని, ప్రపంచానికి మార్గదర్శిగా తన పాత్ర మరింత సమర్ధవంతంగా పోషిస్తుందని చెప్పారు.

భారత్ అభినందన

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రెండోసారి ఎన్నిక కావడం పై భారత్‌ ఆయనకు అభినందనలు తెలిపింది. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌  ఒబామాకు పంపినఅభినందనల సందేశాలలో పేర్కొన్నారు. 
 
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...