Thursday, November 15, 2012

కూచిపూడి నాట్యాచార్యులు వేదాంతం సత్యనారాయణశర్మ మృతి

విజయవాడ,నవంబర్ 15: :కూచిపూడి నాట్యాచార్యులు, పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణశర్మ(77) గురువారం అర్ధరాత్రి కన్నుమూశారు. ఐదు రోజుల క్రితం కండరాల సంబంధిత చికిత్స కోసం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్‌ పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.   భామాకలాపంలో సత్యభామగా... ఉషాపరిణయంలో ఉష... మోహినీ రుక్మాంగదలో మోహిని... క్షీరసాగర మథనంలో మోహిని.. విప్రనారాయణలో దేవదేవిగా చక్కటి అభినయంతో పలువురి మన్ననలు అందుకున్నారు. తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ నుంచి ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. దేశ విదేశాల్లో పలు ప్రదర్శనలు ఇచ్చారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...