శబరిమల కేరళ,నవంబర్ 15: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప యాత్ర శుక్రవారం ప్రారంభమయింది. మలయాళం క్యాలెండర్ ప్రకారం ప్రతినెలా మొదట్లో కొద్ది రోజులపాటు ఆలయాన్ని తెరిచినప్పటికీ నవంబర్ నుంచి జనవరి వరకు నిర్వహించే పూజలకు విశేష ప్రాముఖ్యత ఉంది. ప్రతిఏటా వృశ్చికమాసం మొదటి రోజున శబరిమల యాత్ర ప్రారంభమవుతుంది. ఇది ఈ ఏడాది నవంబర్ 16న వచ్చింది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే 41 రోజుల మండలపూజ డిసెంబర్ 26న ముగుస్తుంది. అనంతరం మకరవిళక్కు మొదలై వచ్చే ఏడాది జనవరి 14న జ్యోతి దర్శనంతో భక్తులు దివ్యానుభూతి చెందుతారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అయ్యప్ప మాల ధరించి 41 రోజుల దీక్ష చేస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడానికి శబరిమల వెళ్తారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment