వాషింగ్టన్,నవంబర్ 7: అమెరికా అధ్యక్ష పీఠాన్ని బరాక్ ఒబామా నిలబెట్టుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో బరాక్ ఒబామా నాయక్త్వం లో డెమాక్రాట్స్ మళ్ళీ జయకేతనం ఎగురవేశారు. 270 మ్యాజిక్ ఫిగర్ ను దాటిన ఒబామా 303 స్థానాలను గెలుచుకున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాను ఆయన కైవసం చేసుకున్నారు. నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోనూ ఒబామా హవా కొనసాగింది. ఒబామాకు గట్టి పోటీ ఇచ్చిన రిపబ్లిక్ అభ్యర్థి మిట్ రోమ్నీ కి 203 స్థానాలు లబించాయి. 180 ఎలక్టోరల్ ఓట్లు వచ్చే వరకూ రోమ్నీ బలంగా పోటీ ఇచ్చారు.ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒబామా ఓట్లు వేగంగా 270 మ్యాజిక్ ఫిగర్ ను దాటిపోయాయి. ఒబామా పెన్సున్వేలియా, మస్సాచూట్స్, న్యూ జెర్సీ, న్యూయార్క్, కనెక్టికట్, మైనీ, మ్యారీల్యాండ్, ఇలినోయిస్, రోడ్ ఐల్యాండ్, వెర్మోంట్, న్యూ హాంప్షైర్, మిన్నేసోట, వాషింగ్టన్ డీసీ రాష్ట్రాల్లో స్పష్టమైన ఆధిక్యత సాధించారు. అదేవిధంగా రోమ్నీ కూడా కెంటకీ, ఓక్లహోమా, సౌత్ కరోలినా, అలబామా, జార్జియా, ఊమింగ్ ఇండియానా, కన్సెస్, ల్యూసియానా, మిస్సిస్సిపీ, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, టెన్నీస్సీ, అర్కన్సా, టెక్సాస్, ఉత్హా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో ఆధిక్యత సాధించారు.
Wednesday, November 7, 2012
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment