కాలిఫోర్నియా,నవంబర్ 20: అమెరికాలో ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళా టెక్కీ మృత్యువాత పడింది. కాలిఫోర్నియాలోని సన్నీవేల్ నగంరోలి జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గొర్ల లలిత అలియాస్ మాగంటి లలిత (32) దుర్మరణం పాలైంది. ఆమె భర్త వీరాంజనేయులు తీవ్రంగా గాయపడ్డాడు. వీరాంజనేయులు కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ఫ్రాన్సిస్కోలో ఎరిక్సన్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. వీరికి 11 సంవత్సరాల క్రితం వివాహం కాగా, శశి (10), భువనేష్ (5) ఇద్దరు కుమారులు ఉన్నారు. భువనేష్ ఏలూరులోని అమ్మమ్మ ఇంటి వద్ద, శశి అమెరికాలోనే తల్లిదండ్రుల వద్ద ఉంటున్నారు. కారులో వెళ్తున్న లలిత, ఆమె భర్త ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఎర్రలైటు పడి ఆగిపోయారు. వెనక నుంచి వచ్చిన వాహనం వీరి కారును ఢీకొట్టింది. లలిత అక్కడికక్కడే మరణించింది. లలిత పుట్టిల్లు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు. కాకినాడ జెఎన్టియులో ఎంటెక్ పూర్తి చేసింది. పెస్లా మోటార్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment