Tuesday, November 20, 2012

ఎట్టకేలకు కసబ్ ఖతం...

పూణే, నవంబర్ 20: : ముంబై పేలుళ్ల కీలక సూత్రధారి మహ్మద్ అజ్మల్ అమీర్ కసబ్ ను బుధవారం ఉదయం పూణే సమీపంలోని ఎర్రవాడ జైలులో ఉరి తీశారు. క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించడంతో కసబ్ కు ఉరిశిక్షను అమలు చేశారు. కసబ్ కు బుధవారం ఉదయం 7 గంటల 36 నిమిషాలకు ఉరిశిక్షను అమలు చేశామని మహారాష్ట్ర హోంశాఖ అధికారులు ధృవీకరించారు. 2008 నవంబర్ 26 తేదిన ముంబైలో మారణహోమం సృష్టించిన సంఘటనలో కసబ్ కీలక సూత్రధారి. ముంబై పేలుళ్ల తర్వాత కసబ్ పట్టుబడ్డాడు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు కసబ్‌కు ఉరిశిక్ష అమలైంది. కసబ్‌ను 2008 నుంచి ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ సెల్‌లో ఉంచారు. హైకోర్టు 2010 అక్టోబర్ 10వ తేదీన ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కసబ్ ఈ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన సుప్రీంకోర్టుకు వెళ్లాడు. ఉరిశిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.పాతికేళ్ల కసబ్‌కు ఉరిశిక్ష విధిస్తూ కింది కోర్టు 2010 మే 6వ తేదీన తీర్పు ఇచ్చింది. ఎస్సై తుకారాం కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్న 18 నెలల తర్వాత ఈ తీర్పు వెలువడింది. మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ కసబ్ మెర్సీ పిటిషన్‌ను సెప్టెంబర్‌లో తిరస్కరించి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేసింది. మెర్సీ పిటిషన్‌ను తోసిపుచ్చాలని సిఫార్సు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని అక్టోబర్‌లో కోరింది.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...