Wednesday, November 21, 2012

అఫ్జల్ గురూ కు త్వరలో ఉరి...


క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన  రాష్ట్రపతి 

న్యూఢిల్లీ,నవంబర్ 21:  2001లో పార్లమెంటుపై దాడి చేసిన ఉగ్రవాది అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం తిరస్కరించారు. అఫ్జల్ గురుతో పాటు మరో ఆరుగురికి కూడా రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించారు. అఫ్జల్‌తో పాటు క్షమాభిక్ష తిరస్కరించబడిన ఆరుగురిలో ముంబయి, కోల్‌కతాకు చెందిన వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడంతో అఫ్జల్ గురుకు కూడా త్వరలో ఉరిశిక్ష అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అఫ్జల్ గురుకు క్షమాభిక్షను తిరస్కరిస్తూ హోంశాఖకు రాష్ట్రపతి ఫైల్‌ను పంపారు.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...