Friday, November 16, 2012

టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్

తిరుమల, నవంబర్ 6:  తిరుమల తిరుపతి దేవస్థానం  ఆస్థాన విద్వాంసుడిగా ప్రముఖ సంగీత కళాకారుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ ను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది.  గోవిందరాజు స్వామి ఆలయంలో బంగారు తాపడం పనులు చేపట్టాలని,  31 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని టీటీడీ విద్యాసంస్థలను ఆధునీకరించాలని  కూడా నిర్ణయించింది. యాత్రికుల సౌకర్యార్థం 70 కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ నుంచి 145 ఎకరాలు కొనుగోలు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో 198 ఏకోపాధ్యాయ పాఠశాలలకు నెలకు 99 వేల రూపాయలను భృతిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...