Saturday, November 17, 2012

పెద్ద దిక్కు కోల్పోయిన మరాఠీలు...

శివసేన అధినేత బాల్ థాకరే కన్నుమూత
ముంబై, నవంబర్ 17 :  దాదాపు 50 ఏళ్ల పాటు  మహారాష్ట్ర రాజకీయాలను శాసించిన శివసేన అధినేత బాల్ థాకరే కన్ను మూశారు.ఈ ఏడాది జులై నుంచి ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.థాకరే శివసేనను 1966లో స్థాపించారు. అయితే శివసేన పార్టీ తీవ్ర విమర్శలకు గురువుతూ వచ్చింది. హింసాత్మక చర్యలకు దిగుతోందంటూ, ద్వేషాన్ని రగిలిస్తోందంటూ ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. మరాఠీ కార్డును వాడడం ద్వారా బలమైన వోటు బ్యాంకును ఆయన సృష్టించుకున్నారు. ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో 1973లో శివసేన తన సత్తా చాటింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు ముంబై పరిసరాల్లోని నగరాలకు కూడా పార్టీ విస్తరించింది.మతతత్వ ఎజెండాతో సంఘ్ పరివార్ 1980 చివరలో, 1990 ప్రారంభంలో ముందుకు వచ్చింది. దాంతో థాకరే దాన్ని అందిపుచ్చుకున్నారు. హిందూత్వ ఎజెండాను స్వీకరించిన బాల్ థాకరే బిజెపితో కలిసి 1995 శాసనసభ ఎన్నికల్లో శివసేన విజయం సాధించింది. అయితే, 1999 ఎన్నికల్లో రెండు పార్టీల కూటమి ఓడిపోయింది. రాజ్ థాకరే పార్టీని చీల్చడంతో శివసేన 2006 లో   బలహీనపడింది. నవనిర్మాణ సేన పేర రాజ్ థాకరే ఏర్పాటు చేసిన సంస్థ శివసేన ఓటు బ్యాంకుకు గండి కొట్టింది.  అక్టోబర్ 24వ తేదీన జరిగిన దసరా సంబరాల్లో తాను ప్రజా జీవితం నుంచి వైదొలుగుతున్నట్లు థాకరే ప్రకటించారు.ఆయన కుమారుడు  ఉద్ధవ్ థాకరే శివసేన ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉన్నారు. శివసేన అధినేత బాల్ థాకరే మహారాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనే ఓ సంచలన రాజకీయవేత్త. మరాఠీల ఆత్మగౌరవ నినాదంతో, మరాఠీల హక్కుల పోరాటంతో ఆయన తన ప్రాంతీయ రాజకీయాలను నడిపించారు. హిందూత్వాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయనను శినసైనికులు దాదాపుగా దేవుడిలాగా ఆరాధిస్తారు. ఆయన ఉద్రేక ప్రసంగాలు అనేక మంది అభిమానులను తయారు చేశాయి.  రాజకీయాల్లో ఆయన కింగ్ కాలేకపోయారు గానీ కింగ్ మేకర్ అయ్యారు. కొంత మందికి మహారాష్ట్ర టైగర్ సాంస్కృతిక యోధుడు కూడా. తన సైగలతో థాకరే దేశ వ్యాపార రాజధాని ముంబైని శాసించారని అంటారు. 

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...