హైదరాబాద్, నవంబర్ 16: మంత్రి గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. దళితులను కించపరచాలనే ఉద్దేశంతో వ్యాఖ్యలు చేయలేదని ఆయన చెప్పారు. ఉపన్యాసంలో తప్పులు దొర్లాయన్నారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నామని అన్నారు. కాగా ,
మంత్రి గీతా రెడ్డిపై కోదండరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ విద్యార్థి సమాఖ్యలు శుక్రవారం తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగాయి. గీతారెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు దళిత సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను కోదండరాం పైఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది. తెలంగాణాకోసం మంత్రి గీతా రెడ్డి కదలి రావడంలేదని ఆక్షేపించడంలో భాగంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడంతో వివాదం చెలరేగింది.
మంత్రి గీతా రెడ్డిపై కోదండరామ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ విద్యార్థి సమాఖ్యలు శుక్రవారం తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగాయి. గీతారెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు దళిత సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. కాగా గీతారెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను కోదండరాం పైఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదైంది. తెలంగాణాకోసం మంత్రి గీతా రెడ్డి కదలి రావడంలేదని ఆక్షేపించడంలో భాగంగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉండడంతో వివాదం చెలరేగింది.
No comments:
Post a Comment