ఇంపాల్, నవంబర్ 5: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోం చాను షర్మిల నిరశనకు 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. మణిపూర్ ప్రజల స్వేచ్ఛ కోసం షర్మిల పుష్కరకాలంగా అన్నపానీయాలు ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇన్నేళ్లుగా ఆమె కనీసం మంచి నీరు కూడా ముట్టలేదు. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం(ఏఎఫ్ఎస్పిఏ)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె 2000 నవంబర్ ఐదో తేది నుండి నిరాహార దీక్ష చేపట్టారు. 2000 నవంబర్ 2న ఇంపాల్ లోయలోని మలోంలో అసోం రైఫిల్స్ ఎన్కౌంటర్లో పదిమంది పౌరులు చనిపోయారు. షర్మిల పౌరహక్కుల కార్యకర్త. దీనిపై ఆమె గళమెత్తారు. వెంటనే ఐదో తేది నుండి నిరాహార దీక్ష చేపట్టారు. మాన వహక్కుల ఉద్యమకారులు కిరాతకమైన చట్టంగా అభివర్ణించే సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేస్తూ ఇప్పటికీ తన దీక్షపై వెనక్కి తగ్గలేదు. ఆత్మహత్య నేరం కింద ఆమె జైలుకు, కోర్టుకు, ఇంటికి అంటూ ఇలా పన్నెండేళ్లుగా తిరుగుతున్నారు. ఫ్లూయిడ్స్ బలవంతంగా ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల జ్యూడిషియల్ కస్టడిలో ఉన్నారు. రోజు రోజుకు ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. పాలకులు స్పందించక పోవడంపై పౌరసంఘాలు మండిపడుతున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment