Monday, November 5, 2012

నాగం నడక ఎటు...?

హైదరాబాద్, నవంబర్ 5: కాంగ్రెసుతో కలిసిపోయే పార్టీలలో తాను చేరబోనని  తెలంగాణ మ నగారా సమితి శానససభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి  తెలిపారు.తద్వారా  తాను తెరాసలో చేరబోనని పరోక్షంగా చెప్పారు. పైగా, ఎన్డీయె తెలంగాణ ఇస్తుందని తాను నమ్ముతున్నట్టు చెప్పడం ద్వారా బిజెపి వైపు ఆయన అడుగులు వేస్తున్నట్లు  అనబడుతోంది. తనకు కావాల్సింది పార్టీ కాదని, తెలంగాణ అని ఆయన అన్నారు.  తెలంగాణకు శత్రువు కాంగ్రెసు పార్టీయేనని,  ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తెలంగాణ ప్రజల మనోభావాలు అర్థమై ఉండేవని ఆయన అన్నారు. బిజెపిలో కూడా తాను చేర బోవడం  లేదని,  అయితే తెలంగాణా సాధన కోసం బిజెపి సహా అని పక్షాలతో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 23వ తేదీ నుంచి తెలంగాణవ్యాప్తంగా భరోసా యాత్ర చేయనున్నట్లు ఆయన తెలిపారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...