రికార్డు స్థాయిలో 74.62 శాతం పోలింగ్
సిమ్లా, నవంబర్ 4: హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74.62 శాతం పోలింగ్ నమోదైంది. తొలుత పోలింగ్ మందకొడిగా సాగినా, ముగింపు దశలో వేగం పుంజుకుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 74.62 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. హిమాచల్లో పోటీ ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్కు మధ్యనే జరిగింది. హిమాచల్లో 1977 నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోలేదు. ఈసారి అందుకు భిన్నంగా ఫలితాలు ఉండగలవని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి వీరభద్ర సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. రెండు ప్రధాన పార్టీలూ మొత్తం అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి.
సిమ్లా, నవంబర్ 4: హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో జరిగిన ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74.62 శాతం పోలింగ్ నమోదైంది. తొలుత పోలింగ్ మందకొడిగా సాగినా, ముగింపు దశలో వేగం పుంజుకుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 74.62 శాతం నమోదైనట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. హిమాచల్లో పోటీ ప్రధానంగా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్కు మధ్యనే జరిగింది. హిమాచల్లో 1977 నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారాన్ని దక్కించుకోలేదు. ఈసారి అందుకు భిన్నంగా ఫలితాలు ఉండగలవని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి వీరభద్ర సింగ్ నేతృత్వంలో కాంగ్రెస్ కూడా గెలుపుపై ఆశలు పెట్టుకుంది. రెండు ప్రధాన పార్టీలూ మొత్తం అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి.
No comments:
Post a Comment