Saturday, November 17, 2012

మమత ' అవిశ్వాస ' అస్త్రం...

కోల్‌కత్తా,నవంబర్ 17: కేంద్రంలో కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వంపై తమ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తుందని తృణమూల్ కాంగ్రెసు అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆమె శనివారం చెప్పారు. యుపిఎ ప్రభుత్వం మైనారిటీలో పడిందని,  మైనారిటీ యుపిఎ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తమ పార్లమెమంటరీ పార్టీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని ఆమె చెప్పారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి.తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఆమె ప్రతిపక్షాలను కోరారు. యుపిఎ సంకీర్ణ ప్రభుత్వం నుంచి తృణమూల్ కాంగ్రెసు తప్పుకున్న విషయం తెలిసిందే. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...