Sunday, November 18, 2012

సవిత మృతిపై ఐర్లాండ్ దర్యాప్తు...

లండన్, నవంబర్ 18: : అబార్షన్ హక్కుపై తమ దేశం ఇప్పటికిప్పుడు హడావుడిగా నిర్ణయం తీసుకోబోదని ఐర్లాండ్ స్పష్టం చేసింది. భారత దంతవైద్యురాలు సవితా హాలప్పనావర్(31) విషాద మృతిపై దర్యాప్తునకు స్వతంత్ర వైద్య నిపుణుడు సహకరిస్తారని హామీ ఇచ్చింది. కేథలిక్ దేశం కావడంతో.. సవితకు ఐర్లాండ్‌లో గర్భస్రావం చేసేందుకు వైద్యులు నిరాకరించడంతో రక్తం విషతుల్యమై ఆమె  మరణించడం తెలిసిందే. ఈ ఉదంతంపై ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీ స్పందిస్తూ,  సవిత మృతిపై నిపుణుల నివేదిక కోసం ఎదురు చూస్తున్నానని, అయితే అబార్షన్ హక్కుపై ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి హడావుడిగా నిర్ణయం తీసుకోబోమన్నారు. ఇలా ఉండగా, భారత దంతవైద్యురాలు సవితా హాలప్పనావర్  విషాద మృతిపై ఐర్లాండ్ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేశారు. గర్భస్రావ చట్టాలను మార్చాలని  వారు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...