Saturday, November 3, 2012

జగన్ కు జైకొట్టిన లక్ష్మీపార్వతి...

ఏలూరు, నవంబర్ 3:  త్వరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరనున్నట్లు ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి శనివారం చెప్పారు. తాను ఎన్టీఆర్ టిడిపి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ఎన్నికల కమిషన్‌కు లేఖ పంపుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్  ఆశయాలను కొనసాగించేందుకు  తాను ఈ పదహారు ఏళ్లు కష్టపడ్డానని చెప్పారు. తనను అమ్మ అని అన్నవాళ్లే తనపై ఎన్నో కుట్రలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో తాను ఎన్టీఆర్ మరణం తర్వాత అనే పుస్తకాన్ని రాయబోతున్నట్లు చెప్పారు. తన ఆశయాలు కొనసాగే అనుకూలమైన వేదికగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీని తాను భావిస్తున్నానని లక్ష్మీ పార్వతి  ఏలూరులో చెప్పారు. ఈ పార్టీ ద్వారా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలను నెరవేరుస్తానని చెప్పారు.
 
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...