హైదరాబాద్, నవంబర్ 3: నీలం తుపాను ప్రభావం వల్ల కోస్తాంధ్ర లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటివరకూ కృష్ణాజిల్లాలో 224 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 172 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎనిమిది మంది మృతి చెందారు. లక్షకు పైగా హెక్టార్లలో పంట నీట మునిగింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 70వేల ఎకరాల్లో పంట నీట మునగగా, రాష్ట్రవ్యాప్తంగా 59 చెరువులకు గండ్లు పడ్డాయి. ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీరు విడుదల చేస్తున్నారు. ఏలూరు జలదిగ్బంధంలో చిక్కుకుంది. తమ్మిలేరు జలాశయం నుంచి వరదనీరు వచ్చిచేరుతుండడంతో నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి.కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం చిననందిగామ వద్ద బుడమేరు కట్టకు గండి పడడంతో విజయవాడ-మైలవరం మధ్య రాకపోకలకు అంతరయ్మ్ ఏర్పడింది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లో పంటపొలాలు నీటమునిగాయి. పలు కాలనీల్లోకి నీరు చేరింది. భారీవర్షాల కారణంగా పలురైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment