Wednesday, November 28, 2012

జగన్ బెయిల్ పిటిషన్‌ తిరస్కృతి...

హైదరాబాద్, నవంబర్ 28: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను  నాంపల్లి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం  తిరస్కరించింది. జగన్ పన్నెండు రోజుల క్రితం స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందన్న, అరెస్టు అక్రమం కాదన్న సిబిఐ వాదనతో ఏకీభవించి ఆయన బెయిల్‌ను తిరస్కరించింది. జగన్ కేసులో తాము సుప్రీం ఆదేశాలను పాటించామని తెలిపింది. అనంతరం మరో బెయిల్ పిటిషన్ పైన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది.
    

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...