Tuesday, November 27, 2012

తొలివిడతగా 29 ప్రభుత్వ పథకాలకు నగదు బదిలీ

న్యూఢిల్లీ,నవంబర్ 27: జనవరి నుంచి  దేశంలో 16 రాష్ట్రాల్లోని   51 జిల్లాల్లో అమల్లోకి తీసుకురానున్న ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ని తొలివిడతగా 29 ప్రభుత్వ పథకాలకు వర్తింపచేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జైరాం రమేష్ మంగళవారం వెల్లడించారు.  రూ.3,20,000 కోట్ల నగదు బదిలీ బృహత్ పథకాన్ని 2013 చివరకల్లా దశలవారీగా దేశమంతా అమల్లోకి తీసుకొస్తామన్నారు. సంక్లిష్టమైన ఆహారం, ఎరువుల సబ్సిడీ మొత్తాలను మినహాయించి తేలిగ్గా అమలుచేయదగ్గ వివిధ మంత్రిత్వశాఖలకు చెందిన 29 పథకాలను మొదటగా నగదు బదిలీ పరిధిలోకి తీసుకొచ్చినట్టు, వీటన్నింటి లబ్ధిదారులకు ఆధార్ కార్డు ఆధారంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తామని  తెలిపారు. విద్యార్థుల ఉపకార వేతనాలు, వృద్ధాప్య పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, మహిళా, శిశు సంక్షేమ పథకాల ఫలాలను నగదు రూపంలో ప్రతి నెలా సరైన సమయానికి లబ్ధిదారులకు అందేవిధంగా చూడటమే ఈ నగదు బదిలీ విధానం అమల్లోని ముఖ్య ఉద్దేశమని చెప్పారు.ఎల్‌పీజీ సబ్సిడీని కూడా ఇదే తరహాలో మున్ముందు అందజేస్తామన్నారు.తొలుతగా నగదు బదిలీని వర్తిం పచేస్తున్న పథకాల్లో మానవ వనరుల అభివద్ధి శాఖ, సామాజిక న్యాయం, సాధికారత శాఖ, మైనారిటీ వ్యవహారాల శాఖ, మహిళా శిశుసంక్షేమ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖలున్నాయని  అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని  హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పుగోదావరి, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో ఈ పధకం అమలు జరుగుతుందని జైరాం రమేశ్ తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...