Monday, November 12, 2012

అదుపులోకి రాని పాతబస్తీ...

హైదరాబాద్, నవంబర్ 12:  భాగ్యలక్ష్మి ఆలయ వివాదంతో పాతబస్తీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుతులు ఇంకా కొనసాగుతున్నాయి.  భాగ్యలక్ష్మి ఆలయం విషయంలో ఎంఐఎం, ప్రభుత్వం తీరును ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ, హిందూ ధార్మిక సంస్థలు  సోమవారం  నిర్వహించిన భారీ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.   ర్యాలీలో పాల్గొన్న పరిపూర్ణానంద స్వామి సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఆలయం విషయమై మజ్లిస్ ఎమ్మెల్యేలు ఆదివారం చార్మినార్ వద్ద ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేసిన  విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా చేపట్టిన భాగ్యలక్ష్మి దేవాలయం ముస్తాబు పనుల్లను  ఎంఐఎం అడ్డుకోవడమే గాక, న్యాయస్థానాన్ని ఆశ్రయించి పనులు జరగకుండా చూడాలనుకున్నారని, అయితే న్యాయస్థానం పూర్వ స్థితి కొనసాగించుకునేందుకు దేవాలయానికి అనుమతి ఇచ్చిందని, ఆ ఉత్తర్వులను అమలుచేయమని కోరితే కూడా పోలీసులు ముందుకు రావడం లేదని  బి.జె.పి. నేత కిషన్‌రెడ్డి ఆరొపించారు.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...