Monday, November 12, 2012

స్వాతంత్ర్య యోధుడు మూర్తి రాజు మృతి...

ఏలూరు, నవంబర్ 12: స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ మంత్రి చింతలపాటి వరప్రసాద మూర్తి రాజు(96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. వరప్రసాదమూర్తి రాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా చిననెండ్రకొలను. 36 ఏళ్లపాటు ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. తన 1,800 ఎకరాల భూమిని పేదలకు పంచారు. రాష్ట్రవ్యాప్తంగా 56 విద్యాసంస్థలు స్థాపించారు. తణుకు స్కూలులో చదువుతున్న రోజుల్లోనే విద్యార్ధి కార్యదర్శిగా ఉండి స్వదేశీ దుస్తులు ధరించి, ఖద్దరు టోపీ ధరించి స్కూలుకి వెళ్ళేవారు. ఎంతో క్రమబద్ధమైన జీవితాన్ని అలవర్చుకున్నారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, జయప్రకాశ్ వంటి నాయకుల ఉపన్యాసాలకు ఉత్తేజితులై చైతన్యబాటను ఎన్నుకొన్నారు.1942 లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని బలపరుస్తూ ఉద్యమ కార్యకర్తలకు చేదోడు వాదోడై నిలిచారు. పశ్చిమగోదావరి జిల్లా బోర్డు సభ్యునిగా పోటీలేకుండా ఎన్నికైయ్యారు.  1952 లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎన్నికయ్యారు.1961 లో అఖిల భారత సర్వోదయ సమ్మేళనాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు లో  ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్రప్రసాద్, ఆచార్య వినోబా భావే, జయప్రకాశ్ నారాయణ, ఆర్యనాయకం చౌదరి, శంకర్ రావ్ దేవ్ వంటి నాయకులు ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.  హరిజనులకోసం కాలనీలను, పేదలకోసం ఇళ్లను, బాటసారుల కోసం విశ్రాంతి గృహాలను, భూదాన యజ్ఞానికి అనేక ఎకరాలను, అనేక విద్యాసంస్థలకు స్థల భవనాలను దానం చేశారు. తన తండ్రి పేరిట చింతలపాటి బాపిరాజు ధర్మసంస్థను స్థాపించి ఉన్నత ఓరియంటల్, ప్రాధమిక, జూనియర్, డిగ్రీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగాల్లో 68 విద్యాసంస్థలను స్థాపించారు. భారతీయ కళా పరిషత్తును స్థాపించి కళాత్మకమైన సేవలను అందించారు. కొల్లేరు ప్రాంత రైతంగానికి సేవలందించారు.వీరు చిననిండ్రకొలను లో గాంధీజీ స్మారక భవనాన్ని నిర్మించారు. 1964 లో ఫిన్ లాండ్ ప్రపంచ శాంతి మహాసభలకు భారత ప్రతినిధిగా వెళ్ళారు. 1971 లో మార్కెటింగ్ శాఖామాత్యులుగా, 1972 లో దేవాదాయ శాఖామంత్రిగా, దేశీయ వైద్య శాఖా మంత్రిగా సేవలందించారు.  
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...