Saturday, November 24, 2012

రాజకీయ రంగం పై ' ఆమ్ ఆద్మీ'

 పార్టీ పేరు ప్రకటంచిన అర్వింద్ కేజ్రీవాల్ 


న్యూఢిల్లీ, నవంబర్ 24: : సామాజిక కార్యకర్త అర్వింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన రాజకీయ పార్టీ పేరును  ఆమ్ ఆద్మీగా  ప్రకటించారు.తమ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతుందని ఆయన తన  చెప్పారు. "నేను ఆమ్ ఆద్మీని. నేను స్వరాజ్ తెస్తాను. నేను లోక్‌పాల్ బిల్లు రూపొందిస్తాను" అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ నెల 26వ తేదీ సోమవారంనాడు తనతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కలవాలని ఆయన ప్రజలను కోరారు. ఆ రోజు సభ్యులుగా చేరే వారంతా పార్టీ వ్యవస్థాపక సభ్యులవుతారని ఆయన అన్నారు.  అవినీతికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడి సామాన్యుడి చేతిలో ప్రజాస్వామ్య శక్తిని పెడతామని కేజ్రీవాల్ అన్నారు.పార్టీలో మహిళలకు, యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పార్టీకి అధిష్టానమంటూ ఏదీ ఉండదని తెలిపారు.  అత్యంత ప్రగతిశీలమైన భారత రాజ్యాంగ స్ఫూర్తితో పార్టీ పనిచేస్తుందన్నరు. పార్టీని నడిపించడానికి 30 మందితో జాతీయ కార్యవర్గం  పని చేస్తుందన్నారు.


 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...