హైదరాబాద్,నవంబర్ 22: అక్రమాస్తుల కేసులో నిందితుడైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రిమాండ్ను సిబిఐ కోర్టు వచ్చే నెల 5వ తేదీ వరకు పొడిగించింది.
వివిధ కేసుల్లో నిందితులైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రిమాండ్ను కూడా కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు వారి రిమాండ్ను వచ్చే నెల 5వ తేదీ వరకు పొడగించింది.జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎమ్మార్ ప్రాఫర్టీస్ అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు ప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి బిపీ ఆచార్య గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. అలాగే జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్ విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు.వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ కేసుల్లో నిందితులైన విఐపి ఖైదీలంతా చంచల్గుడా జైలులోనే ఉన్నారు. వైయస్ జగన్ను సిబిఐ మే 27వ తేదీన అరెస్టు చేసింది. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది.
వివిధ కేసుల్లో నిందితులైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రిమాండ్ను కూడా కోర్టు పొడిగించింది. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన కోర్టు వారి రిమాండ్ను వచ్చే నెల 5వ తేదీ వరకు పొడగించింది.జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఎమ్మార్ ప్రాఫర్టీస్ అక్రమాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కోనేరు ప్రసాద్, మాజీ ఐఏఎస్ అధికారి బిపీ ఆచార్య గురువారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. అలాగే జగతి పబ్లికేషన్స్ వైస్ ఛైర్మన్ విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరయ్యారు.వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వివిధ కేసుల్లో నిందితులైన విఐపి ఖైదీలంతా చంచల్గుడా జైలులోనే ఉన్నారు. వైయస్ జగన్ను సిబిఐ మే 27వ తేదీన అరెస్టు చేసింది. ఆ తర్వాత మోపిదేవి వెంకటరమణను సిబిఐ అరెస్టు చేసింది.
No comments:
Post a Comment