హైదరాబాద్, నవంబర్ 25: సిఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండడంతో మెల్లిగా దూకుడు పెంచుతున్నారు. 2014 ఎన్నికలు లక్ష్యంగా పలు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలోని ఇతర నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆయన పడ్డట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తమను సంప్రదించడం లేదని పలువురు మంత్రులు పలు సందర్భాలలో తమ అసంతృప్తిని బయట పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రులను కలుపుకొని వెళుతున్నారని చెబుతున్నారు. అలాగే మార్పు ఉంటుందని భావించి ఇన్నాళ్లూ ప్రత్యర్థలు కిరణ్ను టార్గెట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది లేదని తేలడంతో ఆయనతో కలిసి వెళ్లేందుకు కొందరు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఆదివారం మెట్రో రైలు ప్రాజెక్టు పిల్లర్లకు దిమ్మెలు అమర్చే కార్యక్రమం లో పాల్గొన్న కిరణ్ జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. 100రూపాయలతో ఇందిరమ్మ అమృత హస్తం పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రెండు లక్షల మంది గర్భిణీలకు, లక్ష మంది పిల్ల తల్లులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 120 కోట్లతో రాజీవ్ విద్యా దీవెన ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల నుండి 150 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 228 ఎస్సీ, ఎస్టీ టీచర్ పోస్టుల భర్తీ, 69 ఉద్యోగాలతో మైనార్టీలకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Sunday, November 25, 2012
కిరణ్ దూకుడు... 2014 టార్గెట్గా కొత్త పధకాలు
హైదరాబాద్, నవంబర్ 25: సిఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత పరిస్థితులు తనకు అనుకూలంగా ఉండడంతో మెల్లిగా దూకుడు పెంచుతున్నారు. 2014 ఎన్నికలు లక్ష్యంగా పలు కొత్త పథకాలు ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలోని ఇతర నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో ఆయన పడ్డట్లుగా కనిపిస్తోంది. ఇన్నాళ్లూ తమను సంప్రదించడం లేదని పలువురు మంత్రులు పలు సందర్భాలలో తమ అసంతృప్తిని బయట పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన మంత్రులను కలుపుకొని వెళుతున్నారని చెబుతున్నారు. అలాగే మార్పు ఉంటుందని భావించి ఇన్నాళ్లూ ప్రత్యర్థలు కిరణ్ను టార్గెట్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు అది లేదని తేలడంతో ఆయనతో కలిసి వెళ్లేందుకు కొందరు సిద్ధపడుతున్నట్టు సమాచారం. ఆదివారం మెట్రో రైలు ప్రాజెక్టు పిల్లర్లకు దిమ్మెలు అమర్చే కార్యక్రమం లో పాల్గొన్న కిరణ్ జగన్ పార్టీని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదన్నారు. పార్టీతోనే ప్రజలకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. 2014లో తిరిగి కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీని ఓడించే పార్టీ రాష్ట్రంలో ఏదీ లేదన్నారు. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. 100రూపాయలతో ఇందిరమ్మ అమృత హస్తం పథకం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా రెండు లక్షల మంది గర్భిణీలకు, లక్ష మంది పిల్ల తల్లులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 120 కోట్లతో రాజీవ్ విద్యా దీవెన ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీని ద్వారా 9, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఇస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వంద రోజుల నుండి 150 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 228 ఎస్సీ, ఎస్టీ టీచర్ పోస్టుల భర్తీ, 69 ఉద్యోగాలతో మైనార్టీలకు ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment