ఆహ్మదాబాద్, నవంబర్ 19: ఇంగ్లాండ్ తో ఆహ్మదాబాద్ లో జరిగిన తొలిటెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 5 వికెట్ల నష్టానికి 340 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఐదవ రోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 406 పరుగులకు ఆలౌటైంది.ఆతర్వాత 77 పరుగుల విజయలక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, పుజారాలు ధాటిగానే ఆరంభించారు. 25 పరుగులు చేసిన సెహ్వగ్ భారీ షాట్ కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద పీటర్సన్ కు దొరికాడు. ఆతర్వాత పుజారాకు జత కలిసిన కోహ్లీ జట్టును విజయపథం వైపు నడిపించారు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ (206) సాధించిన పుజారా రెండవ ఇన్నింగ్స్ లోనూ రాణించి 41 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సెహ్వగ్ 25 పరుగులు చేయగా, కోహ్లీ 11 పరుగులతో క్రీజులో నిలిచారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment