Monday, November 19, 2012

చావు చూసిన ' ఛాత్ '...

పాట్నా, నవంబర్ 19:   బీహార్ రాజధాని పాట్నాలో గంగా ఘాట్ వద్ద ఛాత్ ఉత్సవ  సంబరాల్లో   జరిగిన తొక్కిసలాటలో కనీసం 15 మంది మరణించినట్లు సమాచారం. సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వడానికి వేలాది మంది భక్తులు అక్కడ గుమికూడారు. వారిలో చాలా మంది మహిళలే. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలడం వల్ల ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. ఆ వంతెనను వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. బరువుకు తాళలేక అది కూలిపోయి తొక్కిసలాట సంభవించింది. మృతుల్లో 8 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...