Thursday, November 8, 2012

ఇక డెడ్ లైన్లు లేవ్..డెత్ లైన్లే...

తెలంగాణపై  కె.సి.ఆర్.

కరీంనగర్,నవంబర్ 8:  కాంగ్రెసు ,  తెలుగుదేశం , వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లను తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేస్తేనే ప్రత్యేక రాష్ట్రాన్ని  సాధించుకోగలుగుతామని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు  చంద్రశేఖర రావు అన్నారు. ఈ మూడు పార్టీలు తెలంగాణ ద్రోహ పార్టీలే అన్నారు.పన్నెండేళ్లుగా హోరాహోరీగా సాగుతున్న ఉద్యమంలో అనేక జయాలు, అపజయాలు వచ్చాయని, పుష్కర కాలం ఉద్యమాన్ని సజీవంగా ఉంచుకున్నామన్నారు.  పాలమూరులో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినప్పుడు జెఏసి మద్దతు ఇవ్వలేదని, అది తనను గాయపర్చిందని,  అందుకే జెఏసి తో కొద్ది విభేదాలు వచ్చాయని, అయితే మళ్లీ కలిసి ఉద్యమించలేనంత స్థితిలో విభేదాలు కె.సి.ఆర్.   చెప్పారు.బి.జె.పి. తో  కలిసి పని చేసేందుకు కూడా తమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
తెలంగాణ కోసం పార్టీని విలీనం చేసేందుకు కూడా తాను సిద్ధపడ్డానని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెసు పార్టీ తాత్సారం చేస్తోందని, ఇక నుండి కాంగ్రెసుతో ఎలాంటి సంబంధాలు ఉండవన్నారు.  భవిష్యత్తులో  అసలు ఏ పార్టీతోనూ పొత్తులుండవని, ఈ విషయంలో తాము కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు.
తెలంగాణపై ఇక కాంగ్రెసుకు ఎలాంటి డెడ్ లైన్లు లేవని... ఇక డెత్ లైన్లే అని అన్నారు.
 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...