Thursday, November 1, 2012

పురంధేశ్వరికి ప్రమోషన్...స్వతంత్ర హోదాతో జౌళి శాఖ

న్యూఢిల్లీ,నవంబర్ 1: కేంద్ర మంత్రి పురంధేశ్వరికి  చివరి నిమిషంలో నిలిచి పోయిన పదోన్నతి తిరిగి లభించింది.  ఆమెకు జౌళీ శాఖను స్వతంత్ర హోదాలో అప్పగించారు. ఇప్పటి వరకుజౌళీశాఖను ప్రస్తుత పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి నిర్వహించారు.  దయానిధి మారన్ రాజీనామా తర్వాత జౌళీ శాఖకు క్యాబినెట్ మంత్రిగా ఎవరూ లేరు. సహాయమంత్రిగా పనబాక లక్ష్మి ఉన్నారు.ఇప్పుడు పనబాక పెట్రోలియం శాఖకు వెళ్లడంతో జౌళీ శాఖను పురంధేశ్వరికి స్వతంత్ర హోదాలో కేటాయించారు. దీంతో రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మరో ప్రాధాన్యతమున్న పదవి దక్కినట్టయింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...