హైదరాబాద్ ,నవంబర్ 1: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యా సమితి చైర్మన్ కోదండరామ్తో సహా పలువురిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. రాష్ట్రవతరణ దినోత్సవాన్ని నిరసించాలని, నల్ల జెండాలతో నిరసన తెలపాలని తెలంగాణ జెఏసి పిలుపునిచ్చింది. దీంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు వారిని హౌస్ అరెస్టు చేశారు. ప్రజల ఆకాంక్షను తెలియజేసేందుకే తాను నిరసన చేస్తున్నామని కోదండరామ్ ఈ సందర్భంగా అన్నారు. సీమాంధ్ర ప్రభుత్వంలో తెలంగాణవాదులను అణగదొక్కుతున్నారని నిప్పులు చెరిగారు. కాగా జెఏసి పిలుపు మేరకు తెలంగాణలోని పది జిల్లాల్లో తెలంగాణవాదులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. తెలంగాణా మంత్రులు అవతరణ వేడుకల్లో పాల్గొనక పోవడంతో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జెండా ఎగురవేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment