Monday, October 29, 2012

ఫైనల్లో ఓడిన సైనా..

పారిస్ , అక్టోబర్ 29 : ప్రపంచ మూడో ర్యాంక్ క్రీడాకారిణి, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్  ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఓటమి పాలైంది.
26వ ర్యాంక్‌  జపాన్ క్రీడాకారిణి మితానీ మినాత్సును ఢీకొన్న ఆమె తొలి సెట్‌లో కొంత వరకూ పోరాడినా, ఆ తర్వాత తడబడింది. ఫలితంగా మ్యాచ్‌ని 19-21, 11-21 తేడాతో చేజార్చుకుంది.
అద్భుత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన సైనాకు టైటిల్ దక్కుతుందని అభిమానులు ఆశించారు. కానీ, 22 ఏళ్ల ఈ హైదరాబాదీ పై మినాత్సు అనూహ్యంగా చెలరేగింది. అద్భుతమైన స్మాష్‌లతో విరుచుకుపడింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...