Sunday, October 28, 2012

లేటయినా లేటెస్టు గా పని చేస్తా...చిరు

న్యూఢిల్లీ,అక్టోబర్ 28: మంత్రి పదవి లేటుగా వచ్చినా లేటెస్టుగా బాధ్యతలు నిర్వహిస్తానని స్వతంత్ర హోదాతో పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణం చేసిన చిరంజీవి అన్నారు. మంత్రివర్గంలో అనుభవం ఉన్న వాళ్లకి, యువతకి పెద్ద పీట వేశారన్నారు.014లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకుకృషి చేస్తామని,  సర్వే సత్యనారాయణ, కిల్లి కృపారాణి, బలరాం నాయక్‌లను మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా కాంగ్రెసు పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందనేది అర్థమవుతోందన్నారు. మంత్రి  పదవిని హోదాగా భావించడం లేదని, బాధ్యతగా గుర్తిస్తున్నట్లు చెప్పారు. దేశంలో పర్యాటకరంగానికి అన్ని హంగులు ఉన్నాయని, దేశంలో సుదీర్ఘ తీర ప్రాంతముందని, పీరియడ్ తక్కువ ఉన్నా తన పని తీరు చూపిస్తానన్నారు.  తనపై విశ్వాసం ఉంచి పదవి ఇచ్చారని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలిగిందన్నారు.

 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...