Friday, September 7, 2012

శీతాకాల పార్లమెంటును తుడిచి పెట్టేసిన బొగ్గు దుమారం...

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: :  బొగ్గు కుంభకోణం నేపథ్యంలో  గొడవలు, ప్రతిష్టంభన, వాయిదాలమయంగా సాగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు చివరికి ఆఖరి రోజు శుక్రవారం కూడా అదే గొడవ మధ్య    నిరవధికంగా వాయిదా పడ్డాయి. బొగ్గు గనుల కేటాయింపుల్లో ఖజానాకు రూ.1.86 లక్షల కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్న కాగ్ నివేదిక దుమారం రేపడం, ప్రధాని రాజీనామా డిమాండ్‌తో సభలను బీజేపీ రోజుల తరబడి స్తంభింపజేస్తూ వచ్చింది. శుక్రవారం కూడా ఉభయ సభల్లోనూ అదే తంతు కొనసాగింది.  రాజ్యసభలో చైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆవేదన వ్యక్తం చేస్తూ, సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఏమాత్రం పని చేయని సమావేశాలుగా ఇవి గుర్తుండిపోతాయని అన్నారు. లోక్‌సభను  కూడా ప్రధాని రాజీనామా డిమాండ్‌తో బీజేపీ మరోసారి హోరెత్తించింది. దాంతో స్పీకర్ మీరాకుమార్ కనీసం సాంప్రదాయిక ముగింపు ప్రసంగం కూడా చేయలేకపోయారు! దీనిపై ఆమె తీవ్ర విచారం వెలిబుచ్చుతూ, వచ్చే సమావేశాలైనా సజావుగా సాగుతాయని ఆశాభావం వ్యక్తంచేస్తూ సభను నిరవధికంగా వాయిదా వేశారు. 15వ లోక్‌సభ కాలంలో అత్యధిక సభా సమయం వృథా అయిన సమావేశాల జాబితాలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో స్థానంలో నిలిచాయి. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...