 |
| పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీతో ఎస్.ఎం. కృష్ణ |
ఇస్లామాబాద్, సెప్టెంబర్ 8: నూతన సరళీకృత వీసాల జారీ పై భారత్-పాకిస్థాన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందువల్ల రెండు దేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాలకు మార్గం సుగమం అవుతుంది. మూడు రోజుల పాక్ పర్యటన కోసం ఇస్లామాబాద్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్.ఎం. కృష్ణతో కలిసి పాక్ అంతర్గతశాఖ మంత్రి రెహమాన్ మాలిక్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. 38 ఏళ్లుగా అమలులో ఉన్న పాత ఒప్పందం స్థానంలో దీన్ని కుదుర్చుకున్నారు. తాజా ఒప్పందంతో రెండు దేశాల ప్రజలు సులువుగా వీసా పొందవచ్చు. , పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ తో కూడా ఎస్ఎం కృష్ణ, సమావేశమయ్యారు. పర్యటనలో భాగంగా కృష్ణ పాక్ ప్రధాని పర్వేజ్ అష్రాఫ్తో భారత్-పాక్ సంబంధాలను మెరుగుపరచడంపై చర్చించారు. ఈ ఏడాది చివర్లోగా భారత ప్రధాని మన్మోహన్సింగ్ పర్యటన కోసం ఎదురుచూస్తున్నట్లు పర్వేజ్ తెలిపారు. పాకిస్థాన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత ఖైదీ సరబ్జిత్సింగ్కు క్షమాభిక్ష ప్రసాదించే అంశాన్ని పరిశీలిస్తానని ఆ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హామీ ఇచ్చారు.
Comments