బెంగళూరు, సెప్టెంబర్ 3: న్యూజిలాండ్ తో రెండు టెస్ట్ ల సిరీస్ ను భారత్ 2-0 తో కైవసం చేసుకుంది బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో న్యూజిలాండ్ తో జరిగిన రెండవ, ఆఖరి టెస్ట్ లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గంభీర్ 34, సెహ్వగ్ 38, పుజారా 48, సచిన్ 27, రైనా పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరగా.. కోహ్లీ 51, ధోని 48 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ జట్టులో పటేల్ 3 వికెట్లు, సౌథీ, బోల్ట్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు 9 వికెట్ల నష్టానికి 232 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ 248 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్ జట్టు ముందు 262 పరుగుల లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించడంతో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన భారత కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు.భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది సిరిస్ అవార్డు దక్కింది. గతంలో అజారుద్దీన్ పేరిట ఈ రికార్డు ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment