అనంతపురం, సెప్టెంబర్ 3: పుట్టపర్తి సత్యసాయి తన 44 ఏళ్ల వయసులోనే రాసి రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా చెబుతున్న వీలునామా బయట పడింది. సత్యసాయి ట్రస్టు కు చెందిన సత్యజిత్ పేరిట విడుదల చేసిన ఓ ప్రకటన, దానితోపాటే విడుదల చేసిన సత్యసాయి డిక్లరేషన్ బట్టీ, సత్య సయి తన స్థిర, చరాస్తులన్నీ భక్తులు ఇచ్చినవేనని, వాటిలో ఒక్క పైసా కూడా కుటుంబ సభ్యులకు చెందవని వీలునామలో పేర్కొన్నారని తెలుస్తోంది. తన ఆస్తులను సామాజిక, ధార్మిక కార్యక్రమాలకే వినియోగించాలని, వాటిని కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారని చెబుతున్నారు. 1967 మార్చి 23న ముంబై లో ఈ వీలునామ రిజిస్ట్రేషన్ అయింది. అయితే, సత్యసాయి మరణించిన రెండేళ్ల తర్వాత దీనిని బయట పెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. . అయితే, ఇటువంటి అనుమానాలు ముందే వస్తాయని ఊహించిన, సత్యజిత్ ఆ వీలునామాకు అప్పట్లో సాక్షిగా ఉన్న ఇందూలాల్ షాతో అటెస్టేషన్ చేయించారు. దానిని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. పదేళ్ల కిందటే సత్యసాయి ఈ డిక్లరేషన్ను తనకు ఇచ్చారని చెబుతున్న సత్యజిత్ 2011 నవంబర్ 16వ తేదీనే ట్రస్టు సభ్యుడు ఇందూలాల్ షాతో కలిసి డిక్లరేషన్ను బయట పెట్టాలని భావించానని, కానీ, ఆ తర్వా త వాయిదా వేసుకున్నానని ప్రకటనలో వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment