తెలంగాణ పై స్పష్టత ఇస్తాం...బాబు

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 6:  తెలంగాణ అంశంపై బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీ మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు.  బిసీ డిక్లరేషన్‌పై జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించేందుకు ఢిల్లీ వచ్చిన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అవసరం లేదని, రాష్ట్ర రాజధాని హైదరాబాదు తెలంగాణలోనే ఉన్నందున తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవసరం లేదని అద్వానీ అప్పట్లో అన్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై బిజెపి నేతృత్వంలోని ఎన్డియే తన ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా చర్చించిందా అని ఆయన అడిగారు. ఎప్పుడైనా చర్చకు పెట్టారా, ఈ రోజు మాట మార్చడమేమిటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారంపై కన్నా తెలంగాణను రాజకీయం చేయడం మీదనే దృష్టి పెడుతున్నారని ఆయన ఇతర రాజకీయ పార్టీలను విమర్శించారు. తాము తెలంగాణపై ఇచ్చిన లేఖ కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉందని ఆయన చెప్పారు. తాము ఎప్పటికప్పుడు తెలంగాణపై మాట్లాడుతూనే ఉన్నామని, పార్టీ మహానాడులో కూడా చెప్పామని ఆయన అన్నారు.
తెలంగాణపై మరోసారి తప్పకుండా స్పష్టత ఇస్తానని ఆయన చెప్పారు. బిసి డిక్లరేషన్‌ను ప్రకటించామని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై చర్చించి స్పష్టమైన వైఖరి ప్రకటించామని, ఇప్పుడు తెలంగాణపై కూడా పార్టీలో చర్చించి స్పష్టత ఇస్తామని ఆయన చెప్పారు. తమ పార్టీ తరఫున ఏం చేయాలో అది చేస్తామని ఆయన చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు