డ్రీమ్ లైనర్ విమానం రెడీ

 న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8: ఎయిరిండియా కొనుగోలు చేసిన భారీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ తొలి విమానం శనివారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికాలోని సౌత్ కెరొలైనాలోని బోయింగ్ ఫ్యాక్టరీ నుంచి దీన్ని తీసుకొచ్చారు. ఈ భారీ విమానంలో 256 మంది ప్రయాణించవచ్చు. నాన్‌స్టాప్‌గా 15,000 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించగలదు. మిగతా వాటితో పోలిస్తే ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. ముందుగా దీనిపై పైలట్లు, సిబ్బందికి శిక్షణనిచ్చిన తర్వాత సర్వీసులు ప్రారంభిస్తారు.ఆరేళ్ల క్రితం 27 విమానాలకు ఎయిరిండియా ఆర్డరిచ్చింది. మొదటి విడతగా కొన్ని విమానాలు 2008 సెప్టెంబర్‌లోనే రావాల్సి ఉండగా సాధ్యపడలేదు. దీనిపై బోయింగ్ కొంత మేర పరిహారాన్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో విమానాలను ఎయిరిండియా తీసుకుంటోంది.  కొన్ని వారాల్లోగా మరో రెండు డ్రీమ్‌లైనర్స్‌ను డెలివరీ తీసుకుంటుంది. మార్చి నాటికి మొత్తం ఎనిమిది విమానాలను బోయింగ్ అందజేస్తుంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు