న్యూఢిల్లీ,సెప్టెంబర్ 8: ఎయిరిండియా కొనుగోలు చేసిన భారీ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ తొలి విమానం శనివారం సాయంత్రం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అమెరికాలోని సౌత్ కెరొలైనాలోని బోయింగ్ ఫ్యాక్టరీ నుంచి దీన్ని తీసుకొచ్చారు. ఈ భారీ విమానంలో 256 మంది ప్రయాణించవచ్చు. నాన్స్టాప్గా 15,000 కిలోమీటర్ల దూరం ఇది ప్రయాణించగలదు. మిగతా వాటితో పోలిస్తే ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. ముందుగా దీనిపై పైలట్లు, సిబ్బందికి శిక్షణనిచ్చిన తర్వాత సర్వీసులు ప్రారంభిస్తారు.ఆరేళ్ల క్రితం 27 విమానాలకు ఎయిరిండియా ఆర్డరిచ్చింది. మొదటి విడతగా కొన్ని విమానాలు 2008 సెప్టెంబర్లోనే రావాల్సి ఉండగా సాధ్యపడలేదు. దీనిపై బోయింగ్ కొంత మేర పరిహారాన్ని ఇచ్చేందుకు ఒప్పుకోవడంతో విమానాలను ఎయిరిండియా తీసుకుంటోంది. కొన్ని వారాల్లోగా మరో రెండు డ్రీమ్లైనర్స్ను డెలివరీ తీసుకుంటుంది. మార్చి నాటికి మొత్తం ఎనిమిది విమానాలను బోయింగ్ అందజేస్తుంది.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment