శ్రీహరికోట,సెప్టెంబర్ 9: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ సీ21) ఉపగ్రహ వాహక నౌకద్వారా రెండు విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని సతీష్థావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 9.51 గంటలకు పీఎస్ఎల్వీ సీ 21 ని విజయవంతంగా ప్రయోగించింది. 51 గంటలు కౌంట్డౌన్ కొనసాగిన అనంతరం పీఎస్ఎల్వీ సీ21 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్రాన్స్ కు చెందిన స్పాట్-6, జపాన్ కు చెందిన ప్రొయిటెరస్, మనదేశానికి చెందిన మినీరెడిన్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ21 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ స్పాట్-6 ఉపగ్రహం 1.5 రిజల్యూషన్తో భూమిని చిత్రీకరించనుంది. ఇస్రో ప్రయోగించిన అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహం ఇదే కావడం గమనార్హం.. పీఎస్ఎల్వీ సీ-21 ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం కావడం విశేషం. ఇస్రో 49 ఏళ్లలో 62 ఉపగ్రహాలను, 37 వాహన నౌకల ప్రయోగాలను చేపట్టింది.పీఎస్ఎల్వీ సీ-21 ప్రయోగం విజయవంతమవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.ఇస్రో విజయం దేశానికి గర్వ కారణమని, మన శాస్త్రవేత్తలు మరో ప్రత్యేకత చాటుకున్నారని ప్రధాని మన్మోహన్ అన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
No comments:
Post a Comment